పల్నాడులో కాల్పుల కలకలం

by Disha Web Desk 4 |
పల్నాడులో కాల్పుల కలకలం
X

దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అలవాలలో కాల్పులు కలకలం సృష్టించాయి. రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు బాలకోటిరెడ్డిపై ప్రత్యర్థులు కాల్పులు జరిపారు. బాలకోటిరెడ్డి ఇంట్లో ఉన్న సమయంలో తుపాకీతో ప్రత్యర్థులు రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. కాగా బాలకోటిరెడ్డికి తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో ఆయనను వెంటనే కుటుంబ సభ్యులు నరసరావు పేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు పాల్పడిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పులకు పాల్పడిన వారిని పమ్మి వెంకటేశ్వర రెడ్డి, పూజల రాముడు, గడ్డం వెంకట్రావుగా పోలీసులు గుర్తించారు.


Next Story

Most Viewed