లిల్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఓటీటీలోకి వచ్చేసిన టిల్లు స్క్వేర్!

by Disha Web Desk 8 |
లిల్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఓటీటీలోకి వచ్చేసిన టిల్లు స్క్వేర్!
X

దిశ, సినిమా : టిల్లు స్క్వేర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ అందింది. ఎప్పుడెప్పుడు టిల్లు స్వ్వేర్ సినిమా ఓటీటీలోకి వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.

సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన మూవీ టిల్లు స్వ్కేర్. ఈ మూవీ గతంలో వచ్చి సూపర్ హిట్ అందుకున్న డీజే టిల్లు మూవీకి సీక్వెల్‌గా వచ్చి,100 కోట్లకు పైగా వసూలు రాబట్టి, బాక్సాఫీస్ వద్ద రికారడ్స్ క్రిచేట్ చేసింది. ఇక ఇందులో మొదటిసారిగా అనుపమ రొమాంటిక్ యాంగిల్‌లో కనిపించనుడటంతో కుర్రకారు మొత్తం లిల్లీ వైపే ఇంట్రెస్ట్ చూపారు. ఆ బ్యూటీ బోల్డ్ యాంగిల్‌లో తన నటనతో అందరినీ ఫిదా చేసింది. దీంతో సినిమా ఓటీటీలో వస్తే చూడాలని చాలా మంది ఆరాట పడుతున్నారు. కాగా, నేడు వారి నిరీక్షణకు తెరతీస్తూ, ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. టిల్లు స్క్వేర్ డిజిటిల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ క్రేజీ రైడ్ మూవీ పాన్ ఇండియా భాషల్లో అందరిని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేసింది. ఏప్రిల్ 26( ఈరోజు) నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఇంకెదుకు ఆలస్యం టిల్లు స్క్వేర్ చూసి హాయిగా నవ్వుకోండి.



Next Story

Most Viewed