- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పాతబస్తీలో కత్తితో హడలెత్తిస్తున్న 19 ఏళ్ల అహ్మద్ జాబ్రీ
దిశ, చార్మినార్: ఇంకా మూతి మీద మీసాలు కూడా రాని ఎంతో అమాయకంగా కనిపించే 19 సంవత్సరాల ఈ యువకుడు కత్తి పట్టాడంటే ఎవరైనా హడలెత్తిపోవాల్సిందే. ఇతగాడు రీల్స్ పెట్టాడంటే సోషల్మీడియాలో 10వేల లైక్లు పడాల్సిందే.బైక్ల పై ప్రాణాంతక స్టంట్స్.. కత్తులతో భయానక నృత్యాలు.. హుక్కా పీల్చే ఈ యువకుడి వీడియోలకు ఇన్స్ట్రా లో 14వేల ఫాలోవర్స్ ఉన్నారంటే ఇతగాడి రేంజ్ ఏంటో ఇట్టే అర్థమవుతుంది. ఇంతటితో అయిపోయిందనుకుంటే పొరపాటే. తాగుడుకు బానిసైన ఈ యువకుడు.. డబ్బుల కోసం కత్తి చేతబట్టి దారిదోపిడిలకు పాల్పడతాడు. కనిపించిన ఎంతటి వారినైనా కత్తితో బెదిరించి డబ్బులు వసూలు చేసేదాక వదిలిపెట్టడు. ఏమాత్రం కనికరం లేకుండా ''కాట్ దాల్తూం'' అంటూ బెదిరింపులకు పాల్పడుతాడు. అతని బెదిరింపులు పాతబస్తీలో రోజు రోజుకు అధికమయ్యాయి. తమను బెదిరించాడంటూ బాధితులు సయ్యద్ మహ్మద్, షబ్బీర్లు వేరు వేరుగా ఫిర్యాదు చేయడంతో చాంద్రాయణగుట్ట పోలీసులు అహ్మద్ జాబ్రిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.
చాంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్ కె ఎన్ ప్రసాద్ వర్మ తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీ చాంద్రాయణగుట్ట ఫారూఖీ అజ్మత్నగర్ తాళ్లకుంటకు చెందిన షేక్ హసన్బిన్ ఆలీ అల్ జాబ్రీకి ఆరుగురు కుమారులు. ఇద్దరు కుమారులు రౌడీషీటర్లు కాగా మరో ముగ్గురిపై సస్పెక్ట్ రౌడీ షీట్ ఉంది. 6వ కుమారుడు షేక్ అహ్మద్ బిన్ హసన్ ఆలీ జాబ్రీ అలియాస్ అహ్మద్ జాబ్రీ (19) చదువుకోలేదు. చిన్న నాటి నుండే తన సోదరుల బాట బట్టాడు. అహ్మద్ జాబ్రీ మద్యానికి బానిసయ్యాడు. చేతిలో డబ్బలు లేనప్పుడల్లా కత్తి చేతబట్టి దారిదోపిడీకి పాల్పడే వాడు. ఎంతటి వారినైనా అతి భయంకరంగా బెదిరించేవాడు. అంతేగాకుండా బైక్లపై ప్రాణాంతక విన్యాసాలు చేయడం.. బరాత్లో చాకులు ఎగరేస్తూ ఆడడం.. హుక్కా పీల్చిన వీడియోలను దర్జాగా ఇన్స్ట్రా లో పోస్ట్ చేస్తుంటాడు. ఇతడి పోస్ట్కు కాసేపట్లోనే 10వేల లైక్స్ పడుతాయి. 14వేల మంది ఫాలోవర్స్ ఉన్నారంటే అహ్మద్ జాబ్రీ రేంజ్ ఎంతో ఇట్టే అర్థమవుతుంది. 18 సంవత్సరాలకే తన నేర చరిత్రను ప్రారంభించాడు. గత నెలలో సయ్యద్ మహ్మద్ ను కత్తితో బెదిరించి ముక్కుపై దాడిచేశాడు. అతని వద్ద నుంచి రూ.200 తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.
ఈ నెల 22వ తేదీన చాంద్రాయణగుట్ట ఇంద్రానగర్లో షబ్బీర్ నడిపిస్తున్న నూడుల్స్ షాప్కు వెళ్లాడు. అక్కడ నూడుల్స్ ఆర్డర్ చేయించుకుని తిన్నాడు. నూడుల్స్ డబ్బులు అడిగిన యజమాని షబ్బీర్పై తిరగబడ్డాడు. అతన్ని కత్తితో బెదిరించాడు. క్యాష్ కౌంటర్లో ఉన్న రూ.9వేల నగదుతో పరారయ్యాడు. ఇప్పటి వరకు చాంద్రాయణగుట్ట పోలీస్స్టేషన్లో అహ్మద్ జాబ్రీపై నాలుగు కేసులు నమోదయ్యాయి. సయ్యద్ మహ్మద్, షబ్బీర్ లు వేరు వేరుగా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చివరికి ఆ యువకుడిని చూసి ఇతడు కత్తితో బెదిరించాడా ? నో చాన్స్ అని నవ్వేశారు. ఆ తర్వాత అహ్మద్ జాబ్రీ లీలలు ఒక్కొక్కటిగా బయటపడడంతో ఇతడు మామూలోడు కాదు పక్కా ప్రొఫెషనల్ క్రిమినల్గా పోలీసుల దర్యాప్తులో తేలింది. వెంటనే అహ్మద్ జాబ్రీని అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్కు తరలించారు. ఈ కేసును చాంద్రాయణగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.