ప్రాణం తీసిన సెల్ఫీ పిచ్చి

by Disha Web Desk 7 |
ప్రాణం తీసిన సెల్ఫీ పిచ్చి
X

దిశ, వెబ్‌డెస్క్: ముగ్గురు యువకుల నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఓ నిండు ప్రాణాన్ని బలికొంది. డ్రైవింగ్ చేస్తూ సెల్ఫీ తీసుకోవడంతో కారు అదుపుతప్పి జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కొల్పోగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణ ఘటన తణుకు పట్టణంలో ఆదివారం జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం..

తణుకు పట్టణానికి చెందిన ఓ కోడిగుడ్ల వ్యాపారి సబీర్ హుస్సేన్‌కు చెందిన కారులో అతని కుమారుడు సయ్యాన్ హుస్సేన్.. స్నేహితులు ఆముదాలపల్లి శశికిరణ్, వడ్డి సాయిపవన్ ఫణేంద్ర కలిసి బయటకు వెళ్లారు. కారులో వెళుతున్న క్రమంలో వీరు సెల్ఫీ తీసుకుంటుండగా రోడ్డు మధ్యలో కారు అదుపు తప్పి జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం పలివెలకు చెందిన నంబూరి వీరబాబు(65), తణుకు పట్టాణానికి చెందిన శీల శ్రీను, ఆయన కుమార్తె నాగసత్య దుర్గభవానీ తీవ్రంగా గాయాలపాలయ్యారు. ఇది గమనించిన స్థానికులు ముగ్గురిని 108లో పట్టణ ఆసుప్రతికి తరలించగా.. చికిత్స పొందుతూ వీరబాబు మరణించాడు. శ్రీను, భవానీ చికిత్స పొందుతున్నారు. దీనిపై కేసు నమోదు చేపుకున్న పోలీసులు దర్వాప్తు చేసి.. సాయిపవన్ ఫణీంద్ర, శశికిరణ్‌లను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదంలో కారు నడుపుతున్న సయ్యన్ హుస్సేన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని తెలిపారు.


Next Story

Most Viewed