8 ఏళ్లుగా ఎఫైర్.. ఆ సమయంలో బ్లోడ్‌తో అక్కడ కోసి..

by Disha Web Desk 9 |
8 ఏళ్లుగా ఎఫైర్.. ఆ సమయంలో బ్లోడ్‌తో అక్కడ కోసి..
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్యకాలంలో పెళ్లైన భార్యభర్తలే ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం.. ఆ విషయంలో గొడవలు పడడం, చివరకు ఈ గొడవ కాస్త హత్యలకు దారి తీయడం చూస్తున్నాం. ఇలాంటి ఘోరమైన ఘటనే దిల్లీలోని ఉధమ్‌సింగ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి ఆమెను దారుణంగా హత్య చేసి, పరారయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం..

నిందుతుడి దగ్గర సావిత్రి దేవి అనే మహిళ కూలి పని చేసేది. దీంతో వీరిద్దరి మధ్య పరిచయం పెరగడంతో గత 8 ఏళ్లుగా అక్రమ సంబంధం నడిపిస్తున్నారు. అతడికి భార్య, ఆమెకు భర్త కూడా ఉన్నారు. ఇద్దరి మధ్య గొడవ రావడంతో కోపాద్రికుడైన ఆ వ్యక్తి ఆమెను గట్టిగా తోసేయడంతో కిందపడిపోయింది. దీంతో ఆమె తలకు తీవ్రమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆందోళనకు గురైన నిందుతుడు బ్లేడ్‌తో ఆమె గొంతు కోసి పొలంలో పడేసి పరారయ్యాడు. కనోరి గ్రామంలోని సావిత్రి మృతదేహాన్ని పోలీసులు రెండు రోజుల తర్వాత గుర్తించి, పోస్ట్‌మార్టం పంపించారు. నిందుతుడు తప్పు ఒప్పుకోవడంతో అతడిపై కేసు నమోదు చేశామని కాశీపూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ప్రతాప్ సింగ్ వెల్లడించారు.


Next Story

Most Viewed