ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడి మృతి..

by Disha Web Desk 20 |
ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడి మృతి..
X

దిశ, వైరా : వైరా మండలంలోని వైరా-జగ్గయ్యపేట, మధిర ఆర్ అండ్ రూట్లో ఓ ఆర్టీసీ బస్సు ఢీకొని మల్లారపు రాంబాబు (35) అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సోమవారం సాయంత్రం తాటిపూడికి సమీపంలోని గోదాముల వద్ద వైరా నుంచి మధిర వైపు ద్విచక్రవాహనం పై వెళ్తున్న రాంబాబును మధిర నుంచి ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా ఢీ కొట్టింది. దాంతో రాంబాబు అక్కడికక్కడే మృతిచెందాడు. ఎర్రుపాలెం మండలం బుచ్చిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన రాంబాబు ఫారెస్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడని తెలిసిన సమాచారం మేరకు పోలీసులు ఆశాఖలో వివరాలు తెలుసుకొనేందుకు ప్రయత్నించారు.

అయితే ఫారెస్ట్ అధికారులు తమశాఖలో రాంబాబు పేరు కలిగిన ఉద్యోగి ఎవరూ లేరని పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనాస్థలానికి చేరుకున్న బంధువులు కూడా ఫారెస్ట్ ఉద్యోగి అని చెప్పినప్పటికీ ఎక్కడ పనిచేస్తున్నది స్పష్టంగా చెప్పలేక పోయారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. వైరా ఎస్ఐ శాఖమూరి వీరప్రసాద్ సంఘటనాస్థలాన్ని సందర్శించి కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed