టాయిలెట్‌లో ప్రసవించిన మహిళ.. శిశువును కిటికీలోంచి బయటకు విసిరి హత్య

by Malleboina Mahesh |

ఓ మహిళ టాయిలెట్‌లో మగ బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే శిశువును కిటికీలోంచి బయటకు విసిరి హత్య చేసింది. ఈ హృదయవిదారక సంఘటన మార్చి 22న కోల్‌కతాలోని కస్బా ప్రాంతంలో చోటు చేసుకుంది.

టాయిలెట్‌లో ప్రసవించిన మహిళ.. శిశువును కిటికీలోంచి బయటకు విసిరి హత్య
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ మహిళ టాయిలెట్‌లో మగ బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే శిశువును కిటికీలోంచి బయటకు విసిరి హత్య చేసింది. ఈ హృదయవిదారక సంఘటన మార్చి 22న కోల్‌కతాలోని కస్బా ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళ టాయిలెట్ లో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత శిశువును కిటికీ అద్దాలు పగలగొట్టి బయటికి విసిరింది. అయితే ఆ సమయంలో కిటికీ అద్దాలు పగిలిన శబ్దాలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వచ్చి చూడగా భవనం బయట శిశువు కనిపించింది.

అలాగే టాయిలెట్ లో మహిళా కాళ్లకు రక్తం కనిపించింది దీంతో పోలీసులు ఇద్దరిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. కానీ మరుసటి రోజు ఉదయం శిశువు మృతి చెందింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని మహిళను విచారించగా.. తాను గర్భవతి అనే విషయం తనకు తెలియదని.. “గత కొన్ని నెలలుగా తన ఋతుక్రమం సక్రమంగా ఉన్నందుని మహిళ పేర్కొంది. అలాగే ఒక్కసారిగా ఆమె బిడ్డకు జన్మనివ్వడం ఆందోళనకు గురి చేసిందని.. శిశువు ఏడుపు విని కలవరపడ్డానని.. అందుకే గాజు అద్దాలు పగలగొట్టి తర్వాత శిశువును కిటికీలోంచి బయటకు విసిరినట్లు ఆమె తెలిపిందని పోలీసులు తెలిపారు.

Next Story