ఈతకు వెళ్లి బాలుడు మృతి

by Dishafeatures2 |
ఈతకు వెళ్లి బాలుడు మృతి
X

దిశ, కళ్యాణదుర్గం : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ సమీపంలో ఉన్న స్విమ్మింగ్ పూల్ కు ఈతకు వెళ్లి చరణ్ (12) బాలుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చరణ్ తన తల్లిదండ్రులతో కలిసి స్విమ్మింగ్ పూల్ లో ఈత నేర్చుకోవడానికి వెళ్లాడు. తండ్రి బయటకు వెళ్లిన సమయంలో చరణ్ ఈత నేర్చుకోవడానికి స్విమ్మింగ్ పూల్ లోకి దూకి మృత్యువాత పడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Next Story

Most Viewed