మహబూబ్‌నగర్ జిల్లాలో కరోనా మహమ్మారి టెన్షన్

by Disha Web Desk 2 |
మహబూబ్‌నగర్ జిల్లాలో కరోనా మహమ్మారి టెన్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: మహబూబ్‌నగర్ జిల్లాలో అంటువ్యాధులు విజృంభిస్తున్నాయి. జలుబు, దగ్గు, శ్వాసకోస ఇబ్బందులతో జిల్లా నలుమూలల నుంచి ప్రజలు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. కరోనా మళ్లీ విస్తరిస్తోందన్న వార్తలు విస్తృతమైన నేపథ్యంలో కోవిడ్ లక్షణాలు కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే దేశంలోని కరోనా కొత్త వేరియంట్ ప్రవేశించిందని, గుజరాత్, ఒడిషా రెండు చొప్పున కేసులు నమోదు అయ్యాయని వార్తలు వచ్చాయి. అంతేగాక, ఈ కొత్త వేరియంట్ మరింత ప్రమాదకరమని, ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలకే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరించడంతో జనాలు టెన్షన్ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అప్రమత్తమైన మహబూబ్‌నగర్ వైద్య సిబ్బంది అంటువ్యాధులతో వస్తోన్న ప్రజలకు చికిత్స అందిస్తున్నారు. అనుమానం ఉన్న రోగులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.


Next Story

Most Viewed