- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలో కారోనా వైరస్ విద్యార్థులపై పంజా విసురుతోంది. కేవలం రెండు రోజుల్లోనే ఎనిమిది మంది విద్యార్థులు మహమ్మారి బారినపడ్డారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలు ప్రారంభమై పదిరోజులు కూడా కాకముందే, విద్యార్థులు వైరస్ బారిన పడటం అందరినీ కలవరపెడుతోంది. బుధవారం జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన ఒక విద్యార్థి, ప్రభుత్వ బాలికల కళాశాలకు చెందిన మరో ముగ్గురు వైరస్ బారినపడ్డారు. గురువారం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు పరీక్షలు చేయించుకోగా, అందరికీ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వారికి తగిన జాగ్రత్తలు చెప్పి హోం క్వారంటైన్కు తరలించారు.
Next Story