ఎన్నికల వేళ కాంగ్రెస్ బంపర్ ఆఫర్.. వారికి స్మార్ట్ ఫోన్లు, స్కూటీలు

by  |
ఎన్నికల వేళ కాంగ్రెస్ బంపర్ ఆఫర్.. వారికి స్మార్ట్ ఫోన్లు, స్కూటీలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఎన్నికలొచ్చాయంటే చాలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు వివిధ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. కొందరు ఓటుకు డబ్బును పంచితే.. మరికొందరు వస్తువులు పంచుతుండటం చూస్తుంటాం. అయితే, ఏకంగా స్మార్ట్ ఫోన్లు, స్కూటీలు ఇస్తామని ప్రకటించడం ఎక్కడైనా చూశారా?. ఉత్తర్ ప్రదేశ్ లో జరగనున్న ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ ఓటర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. మహిళలకు అధిక ప్రాధాన్యతనిచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయం తీసుకోగా.. తాజాగా, విద్యార్థినులకు వరాలు కురిపించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే.. ఇంటర్‌ పాసైన బాలికలకు ఫ్రీగా స్మార్ట్‌ఫోన్‌లు, డిగ్రీ విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని ప్రియాంకా గాంధీ హామీ ఇచ్చింది.


Next Story

Most Viewed