కల్నల్‌ సంతోష్‌బాబు త్యాగం మరువలేనిది : కేటీఆర్

by  |
Minister KTR
X

దిశ, వెబ్‌డెస్క్: ఉగ్రవాదులో పోరాడి వీరమరణం పొందిన కల్నన్ సంతోష్ బాబు పది అడుగుల కాంస్య విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆ చౌరస్తాకు కల్నల్ సంతోష్ బాబు చౌరస్తాగా నామకరణం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. దేశం కోసం ప్రాణాలు అర్పించిన కల్నల్‌ సంతోష్‌బాబు త్యాగం ఎప్పుటికీ మరువలేనిదని అన్నారు. సంతోష్‌ బాబు స్ఫూర్తితో యువత సైన్యంలో చేరాలని కల్నల్ భార్య సంతోషి పిలుపునిచ్చారు. సూర్యాపేటలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడంతో సంతోషంగా ఉందని ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంతోష్‌బాబు తల్లిదండ్రులతో​ పాటు ఆయన సతీమణి, ఎంపీ బడుగు లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య, చిరుమర్తి లింగయ్య యాదవ్‌లతో పాటు ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి పాల్గొన్నారు.


Next Story

Most Viewed