- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఏపీబ్యూరో: ఏపీ సీఎం వైఎస్ జగన్ కుటుంబ సభ్యులతో కలిసి సిమ్లాలో హల్చల్ చేస్తున్నారు. గురువారం సాయంత్రం భార్య భారతీరెడ్డితో కలిసి సీఎం జగన్ హిమాచల్ ప్రదేశ్లోని హిల్ స్టేషన్ సిమ్లా చేరుకున్నారు. అయితే శనివారం సీఎం జగన్ దంపతుల పెళ్లి రోజు. అంతేకాదు వీరి వివాహం జరిగి 25 ఏళ్లు అవుతుంది. ఈ నేపథ్యంలో అక్కడే జగన్ దంపతులు సిల్వర్ జూబ్లీ వివాహ వేడుకలను జరుపుకోనున్నారు. 2019 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సీఎం జగన్ ఒకసారి మాత్రమే అమెరికా పర్యటనకు వెళ్లారు. ఆ తర్వాత ఇప్పటి వరకు వెళ్లలేదు. గత కొంతకాలంగా సమీక్షలు.. పార్టీ కార్యక్రమాలు.. పాలనా వ్యవహారల్లో నిత్యం బిజీబిజీగా గడుపుతున్న జగన్ కుటుంబ సభ్యుల కోసం ఓ నాలుగురోజులు కేటాయించాలని నిర్ణయించారు. అందులో భాగంగా సిమ్లా పర్యటనకు శ్రీకారం చుట్టారు. తొలుత ప్యారిస్ పర్యటించాలని భావించారని.. అయితే అది కుదరకపోవడంతో.. సిమ్లా వెళ్లినట్లు తెలుస్తోంది. ఇకపోతే పర్యటన ముగించుకుని ఈ నెల 30 లేదా 31న తిరిగి తాడేపల్లిలోని సీఎం జగన్ దంపతులు తమ నివాసానికి చేరుకోనున్నారు.