ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త..

by Sujitha Rachapalli |

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాపై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఇప్పటికే షూటింగ్ స్పాట్ పిక్స్ లీక్ కాగా మంచి బజ్ క్రియేట్ అయింది. ప్రస్తుతం హీరోయిన్ రుక్మిణీ వసంత్, తారక్ మధ్య సీన్స్ చిత్రీకరణ జరుగుతుండగా.. సోషల్ మీడియాలో ఈ

ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త..
X

దిశ, సినిమా : ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాపై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఇప్పటికే షూటింగ్ స్పాట్ పిక్స్ లీక్ కాగా మంచి బజ్ క్రియేట్ అయింది. ప్రస్తుతం హీరోయిన్ రుక్మిణీ వసంత్, తారక్ మధ్య సీన్స్ చిత్రీకరణ జరుగుతుండగా.. సోషల్ మీడియాలో ఈ మూవీకి సంబంధించిన హాట్ టాపిక్ మరొకటి కూడా నడుస్తోంది. ఈ మూవీకి రెండు పార్ట్స్ చిత్రీకరణ ఒకేసారి జరుగుతుందని.. మొదటి భాగం రిలీజ్ చేశాక.. రెండో భాగం 15 రోజుల వ్యవధిలో విడుదల చేస్తారని టాక్. ప్రాజెక్ట్‌పై అంత నమ్మకంతో ఉన్నారని.. ఈ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులన్నీ బ్రేక్ చేస్తాడని.. తారక్ చరిత్ర తిరగరాయడం ఖాయమని అంటున్నారు ఫ్యాన్స్. ‘వార్ 2’తో నిరాశలో ఉన్న అభిమానులు.. ఈ న్యూస్‌తో ఫుల్ ఖుష్ అవుతున్నారు. అప్‌డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పటిలాగే ప్రశాంత్ నీల్.. బ్లాక్ అండ్ వైట్ బ్యాక్ గ్రౌండ్‌ను యూజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story