- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మంగళవారం టీడీపీ సీనియర్ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వైసీపీ ప్రభుత్వ ఉదాసీనత వల్ల ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశంలో రోజూ నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల్లో రాష్ట్రంలోనే 13 శాతం ఉంటున్నాయని విమర్శలు చేశారు. మీటర్ల పేరుతో రైతుల మెడకు ఉరితాళ్లు తగిలించడం హేయమైన చర్య అన్నారు. అంతేగాకుండా దేశ వ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దమనకాండను ఎండగట్టాలని సూచించారు. రాష్ట్రంలో వైసీపీ బాధిత కుటుంబాలకు టీడీపీ అండగా ఉంటుందని చంద్రబాబు తెలిపారు.
Next Story