గూడూరు టోల్ ప్లాజా వద్ద కారు దగ్ధం

by  |
Car Burning
X

దిశ, భువనగిరి రూరల్: రన్నింగ్‌లో ఉన్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధం అయింది. ఈ ఘటన బుధవారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు టోల్ ప్లాజా వద్ద జరిగింది. హైదరాబాద్‌లోని అల్వాల్ ప్రాంతానికి చెందిన సంజయ్ కుమార్ ఏపీ 10ఈఈ 3224 నెంబర్ గల రెనాల్ట్ లాడ్జ్ కారులో భువనగిరి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా టోల్ ప్లాజా దగ్గరకు రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సంజయ్ కుమార్ కారును నిలిపివేసి అందులో ప్రయాణిస్తున్న వారు దిగి పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. క్షణాల్లోనే కారు మంటలు కాలి బుడిద అయింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.

Next Story

Most Viewed