- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
EPFO: ఉద్యోగులకు అదిరే అప్డేట్.. ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ ఎంతో బెస్ట్ అట.. మీరూ ట్రై చేయండి

దిశ, వెబ్ డెస్క్ : EDLI: ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త. ఉద్యోగుల సామాజిక భద్రతా కల్పించేందుకు ఎంప్లాయిూస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీము(Employees' Deposit Linked Insurance Scheme)ను 1976లో భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)నిర్వహించే స్కీము ఇది. ఈ స్కీము ఈపీఎఫ్ లో సభ్యులుగా ఉన్న ప్రైవేట్ రంగ ఉద్యోగులకు జీవిత బీమా ప్రయోజనాలు అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈపీఎఫ్ లో వాటాదారులైన ఉద్యోగులకు నిబంధనల ప్రకారం ఈ స్కీమును ఫ్రీగా అమలు చేస్తారు.
ఈడీఎల్ఐ(EDLI) స్కీము గురించి పూర్తి వివరాలు:
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్(EPFO) ఇతర నిబంధనల చట్టం 1952 కింద నమోదు అయిన అన్ని సంస్థలకు ఈ స్కీం వర్తిస్తుంది. నెలకు రూ. 15,000 వరకు మూల వేతనం ఉన్న ఉద్యోగులు ఈ స్కీములో డిఫాల్ట్ గా చేరుతారు. ఉద్యోగి నెలలవారీ వేతనంలో 0.5శాతం యజమానులు ఈడీఎల్ఐ(EDLI) స్కీముకు విరాళంగా ఇస్తాను. గరిష్ట వేతన పరిమితి రూ. 15,000 వరకు మాత్రమే వర్తిస్తుంది. ఈడీఎల్ఐ(EDLI) లో ఉద్యోగి నుంచి ఎలాంటి కంట్రిబ్యూషన్ అవసరం లేదు.
సర్వీసులో ఉండగా ఉద్యోగి మరణించినట్లయితే రిజిస్టర్డ్, నామినీకి ఏకమొత్తంలో బీమా డబ్బులు అందుతాయి. గత 12నెలల్లో ఉద్యోగి తీసుకున్న సగటు నెలలవారీ వేతనానికి 30రెట్లు, నెలకు గరిష్టంగా రూ. 15,000కు లోబడి ఈ ప్రయోజనాలను లెక్కిస్తారు. కనీస హామీ ప్రయోజనం రూ. 2.5లక్షలు, గరిష్ట ప్రయోజనం రూ. 7లక్షలుగా ఉంది. ఇది నెలవారీ గరిష్ట వేతన లిమిట్ పై ఆధారపడి ఉంటుంది. మరణించిన ఉద్యోగుల కుటుంబాల ఆర్థిక, సామాజిక భద్రత కల్పించేందుకు ఈ స్కీము ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఈ స్కీములో ఉద్యోగి వేతనం 0.5శాతం వాటాను యాజమాన్యం జమచేస్తుంది. అయితే దీని కంటే మెరుగైన ఇన్సూరెన్స్ పాలసీ(Insurance policies)లు ఏమైనా ఉన్నట్లయితే యజమానులు తమ ఉద్యోగుల కోసం గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమును కూడా తీసుకోవచ్చు. ఇది ఈడీఎల్ఐ స్కీము ద్వారా అందించే కవరేజీకి సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి.
ఉద్యోగి మరణించినట్లయితే నామినీకి లేదా వారసులకు ఈ డబ్బులు అందుతాయి. అందుకు అవసరమైన డాక్యుమెంట్లతోపాటు క్లెయిమ్ ఫారాన్ని ఈఫీఎఫ్ఓకు సమర్పించాలి. క్లెయిమ్ మొత్తం నేరుగా నామినీ బ్యాంకు అకౌంట్లో జమ చేస్తారు. అందుకోసం నామినీ ఈఫీఎఫ్ఓ(EPFO)వెబ్ సైట్ లేదా సమీపంలోని ఈపీఎఫ్ఓ కార్యాలయం నుంచి ఫారం 5 ఐఎఫ్ ను పొందాలి. మరణించిన ఉద్యోగి పీఎఫ్(PF) అకౌంట్ నెంబర్, మరణించిన తేదీ, నామినీ వివరాలతోపాటు అవసరమైన అన్ని వివరాలను ఫారంతో నింపి కార్యాలయంలో అందించాల్సి ఉంటుంది. అందుకు అవసరమైన డాక్యుమెంట్లను జత చేయాల్సి ఉంటుంది.