- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, పాలేరు: అభంశుభం తెలియని ఆరేళ్ళ మైనర్ బాలికపై 8వ తరగతి బాలుడు అత్యాచారం యత్నం చేసినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్న ఘటన పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలంలోని ఓ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఆదివారం కావడంతో ఆడుకుంటున్న పాపను ఇంటి పక్కన ఉన్న 13 సంవత్సరాల బాలుడు ఆ పాపను తన ఇంట్లోకి తీసుకెళ్లి తలుపులు మూసి వికృత చేష్టలు చేయబోగ పాప ఏడుస్తూన్న విషయాన్ని చుట్టుపక్కల వారు గమనించారు. పాప తల్లిదండ్రులు ,అటు బాలుడు తల్లిదండ్రులు సహితం కూలీ పనులకు వెళ్లారు. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు పాప విషయాన్ని చెప్పగా కోపోద్రికులైన పాప తల్లిదండ్రులు బాలుడు ఇంటి వద్దకు వెళ్లి గొడవకు దిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
దీనితో పాప తల్లిదండ్రులు నేలకొండపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు పాపను లేడీ కానిస్టేబుల్ సమక్షంలో ఆసుపత్రికి తరలించారు. బాలుడిపై పొక్సో చట్టం కింద కేసు నమోదు చేయనున్నట్లు ఏఎస్సై రాఘవయ్య తెలిపారు. ప్రస్తుతం పాప ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.