అన్నదమ్ముల ఫైటింగ్.. గొడ్డలి, కర్రలతో తల పగలగొట్టిండ్రు

by  |
అన్నదమ్ముల ఫైటింగ్.. గొడ్డలి, కర్రలతో తల పగలగొట్టిండ్రు
X

దిశ, ఎల్లారెడ్డి : ఆస్తి పంపకాల విషయంలో తలెత్తిన వివాదం అన్నదమ్ములు ఒకరినొకరు నరుక్కనే స్థాయికి తీసుకెళ్లింది. చివరకు గొడ్డలితో సోదరుడి తలపై వేటు వేసేందుకు పురిగొల్పింది. ఈ దాడిలో అశోక్ అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. తలలో గొడ్డలి గాటు పడటంతో తీవ్రరక్తస్రావం జరిగింది. ఈ ఘటన పట్టణంలోని కల్యాణి బేస్ కాలనీలో గురువారం వెలుగుచూసింది. బాధితుడి భార్య చింతకుంట సారిక ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వివరాల్లోకివెళితే.. కల్యాణి బేస్‌కు చెందిన చింతకుంట అశోక్, చింతకుంట అజయ్ మధ్య గత కొన్ని సంవత్సరాల నుంచి ఆస్తుల విషయంలో తరుచూ గొడవలు జరుగుతుండేవి.ఇదే విషయమై గురువారం కుటుంబ సభ్యులు, బంధుల మధ్య పంచాయితీ జరిగింది. ఆస్తుల పంపకం ఎటు తేలకపోగా సారిక భర్త అశోక్ పై అతని పెద్ద బావ అజయ్, భార్య సుష్మ, తన మామ బాలయ్య, చిన్న మామ రాజు, బంధువులు పోచయ్య, భవనేశ్, వెంకటేష్, మమతా తదితరులు బూతులు తిడుతూ కర్రలు, గొడ్డలితో అశోక్‌పై దాడి చేశారు. ఈ దాడిలో అతనికి తీవ్రగాయాలయ్యాయి. అతేకాకుండా మరిది భానుచందర్, అత్తమ్మ కంసవ్వలు కూడా దాడిలో గాయపడ్డారు. అశోక్ భార్య సారిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.



Next Story