ఏపీ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం

by  |
ఏపీ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది అడ్మిషన్ సహా పలు రకాల ఫీజులను రద్దు చేస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది. రీ అడ్మిషన్లు, మీడియం లేదా గ్రూప్ మార్పులకు వసూలు చేసే ఫీజును పూర్తిగా రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు ఇంటర్ కాలేజీ ప్రిన్సిపాల్‌లకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. కరోనాతో ఈ ఏడాది రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం అందులో భాగంగానే ఇంటర్ విద్యార్థులకు మరింత వెసులు బాటు కల్పించే విధంగా ఫీజులను రద్దు చేసినట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed