సీఎంను జాదూ రెడ్డి అంటావా? ఆ ఇద్దరికి ఎమ్మెల్యే వార్నింగ్

by Disha Web Desk |
సీఎంను జాదూ రెడ్డి అంటావా? ఆ ఇద్దరికి ఎమ్మెల్యే వార్నింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తే సహించేది లేదని దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి హెచ్చరించారు. వైఎస్ జగన్‌ను జాదూ రెడ్డి అంటూ యువగళం పాదయాత్రలో లోకేశ్ వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు. ఒక ముఖ్యమంత్రిపై అలాంటి విమర్శలు సహేతుకం కాదన్నారు. రాష్ట్రంలో యాత్రలు చేస్తున్న చంద్రబాబు, లోకేశ్‌లు అధికారంలోకి వస్తే ప్రజలకు ఏమి చేస్తారో.. గతంలో ఏం చేశారో చెప్పే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. కేవలం ప్రభుత్వాన్ని, పోలీసులను తిట్టడానికే లోకేశ్, చంద్రబాబు నాయుడులు యాత్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలుగుదేశం హయాంలో ప్రజలకు ఏం చేశారో చెప్పే ధైర్యం ఉందా లోకేశ్ అని నిలదీశారు. విశాఖలో మార్చినెలలో జరిగే విశాఖ సమ్మిట్‌కు పారిశ్రామిక వేత్తలందరినీ ఆహ్వానిస్తు్న్నట్లు తెలిపారు. ఈ సమ్మిట్ అనంతరం రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆశాభావం వ్యక్తం చేశారు.


Next Story

Most Viewed