- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కూతురు లవ్ మ్యారేజ్.. కట్టలు తెంచుకున్న కన్న ప్రేమ
దిశ, వెబ్ డెస్క్: ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం సీతారామపురంలో దారుణం జరిగింది. కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని తండ్రి ఆవేశం కట్టలు తెంచుకుంది. అల్లుడిపై కత్తులతో దాడి చేశారు. అనంతరం కూతురుని తనతో తీసుకెళ్లిపోయారు. అయితే మామ దాడిలో అల్లుడికి తీవ్ర గాయాలయ్యాయి. సీతారామపురానికి చెందిన శ్రావణి, వంశీ ప్రేమించుకున్నారు. ఈ విషయం శ్రావణి ఇంట్లో తెలియడంతో పెద్దలు ఒప్పుకోలేదు. కానీ శ్రావణి, వంశీ ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నారు. తండ్రి నుంచి ప్రాణహాని ఉందని గ్రహించిన శ్రావణి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే శ్రావణి తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. కానీ తండ్రి తట్టుకోలేకపోయారు. ఎలాగైనా సరే తన కూతురిని తీసుకెళ్లిపోవాలనుకున్నారు. బంధువులను వెంట తీసుకుని వెళ్లి అల్లుడు వంశీ ఇంటిపై దాడి చేశారు. కత్తులు, రాడ్లతో విచక్షణారహితంగా విరుచుకుపడ్డారు. ఈ దాడిలో గాయపడిన వంశీ నూజివీడు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.