- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
AP Politics:ఏపీ ఎలక్షన్లో హీట్ పుట్టిస్తున్న హరిరామ జోగయ్య లేఖ
దిశ ప్రతినిధి,పశ్చిమగోదావరి: ఏపీలో ఎన్నికల వేళ హిట్ పుట్టిస్తున్న లేఖ. కాపు సామాజిక వర్గం పెద్ద, సీనియర్ రాజకీయ నేత చేగొండి హరిరామజోగయ్య, సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను స్థాపించిన కాపు సంక్షేమ సేనను రద్దు చేసిన విషయం గతంలో దుమారం రేపింది. కొత్తగా తెరపైకి కాపు, తెలగ, బలిజ సంక్షేమ సేన రాష్ట్ర వ్యాప్తంగా కాపుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని హరి రామ జోగయ్య ఈ నెల 16 న లేఖ ద్వారా తెలిపారు. కాపు సంక్షేమ సేన పేరుతో వేలాదిమంది కాపు కులస్తులు, మాజీ హోం మంత్రి, మాజీ పార్లమెంట్ సభ్యులు చేగొండి హరిరామజోగయ్య, వ్యవస్థాపక అధ్యక్షులు సారధ్యంలో కమిటీలుగా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఉన్న కాపుల సంక్షేమం కోరి ముఖ్యంగా విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్స్ సౌకర్యం కలుగచేయడమే ధ్యేయంగా ముందుకు నడిపించామని,అనేక కార్యక్రమాలు గత 4 ఏండ్ల నుంచి చేస్తున్న సంగతులు తెలిపారు.
కాపు కులస్తులు వామపక్ష భావజాలం కలిగిన పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి చేయాలనే లక్ష్యంతో జనసేన పార్టీ భవిష్యత్తు కోరి కాపు సంక్షేమ సేన పని చేస్తుందని అన్నారు. ఈ మధ్య పుట్టగొడుగుల్లా అనేక డూప్లికేట్ కాపు సంస్థలు ఏర్పడటం ప్రజల దగ్గర చందాలు పేరుతో డబ్బులు వసూలు చేసి జేబులో వేసుకోవడం జరుగుతున్నదని లేఖ ద్వారా తెలిపారు. ఏలూరు కేంద్రంగా కాపు సంక్షేమసేనకు అనుబంధనంస్థ అంటూ కాపు సంక్షేమ సంస్థ అనే పేరు పై పులి శ్రీరాములు, ఆధ్వర్యంలో ఒక డూప్లికేట్ సంస్థ కొత్తగా ఏర్పడినట్లు ఈ సంస్థకు కాపు సంక్షేమ సేనకు ఎటువంటి సంబంధం ఉండదని , పులి శ్రీరాములుకు కాపు సంక్షేమ సేనతో ఎటువంటి సంబంధం లేదని తెలిపారు.
ఆయన కాపు సంక్షేమ సేన నుంచి బహిష్క్రుతుడయిన మాజీ సభ్యుడని ,ఈయన తలపెట్టి చేసే ఏ చర్యలు కాపు సంక్షేమ సేనకు గాని, ప్రస్తుతం కొత్తగా రూపుదిద్దుకున్న కాపు బలిజ సంక్షేమ సేన గాని ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం కాపు సంక్షేమ సేనకు సుబరిధ సంస్థ అయిన కాపు బలిజ సంక్షేమ సేన రాష్ట్ర వ్యాప్తంగా కాపుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నది. కాపు బలిజ సంక్షేమ సేన ఏలూరు జిల్లా అధ్యక్షుడుగా పుప్పాల శ్రీనివాస్ నియమింపబడి పనిచేస్తున్నారనీ ఏలూరు జిల్లాలో ఉన్న కాపు సోదర సోదరీమణులందరూ పుప్పాల శ్రీనివాస్కి పూర్తి సహకారం అందించవలసినదిగా కోరారు. అయితే హరిరామజోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాశ్ వైసీపీలో చేరిన విషయం అందరికీ తెలిసిన విషయమే.