Godavariలో పడవ బోల్తా.. ఇద్దరు మత్స్యకారుల కోసం గాలింపు

by Disha Web Desk 16 |
Godavariలో పడవ బోల్తా.. ఇద్దరు మత్స్యకారుల కోసం గాలింపు
X

దిశ వెబ్ డెస్క్: ఏలూరు జిల్లా పోలవరం వద్ద గోదావరిలో మత్స్యకారుల పడవ బోల్తా పడింది. దీంతో ఐదుగురు మత్స్యకారులు గోదావరిలో గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. మరో ఇద్దరి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. పోలవరానికి చెందిన అప్పలస్వామి, కృష్ణమూర్తి గల్లంతైనట్లు గుర్తించారు. చీకటిపడటంతో గాలింపు చర్యలు కష్టంగా మారాయి. దీంతో అప్పలస్వామి, కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ వారు సురక్షితంగా బయటకు రావాలని కోరుకుంటున్నారు.


Next Story

Most Viewed