Breaking News: దంపతులు సహా మరో వ్యక్తి మృతి

by Disha Web Desk 16 |
Breaking News: దంపతులు సహా మరో వ్యక్తి మృతి
X

దిశ వెబ్ డెస్క్: అనకాపల్లి జిల్లా యలమంచిలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై స్కూటీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. విశాఖ నుంచి విజయవాడ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతుల్లో దంపతులు సహా మరో వ్యక్తి ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంపై స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. మృతుల వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రోడ్డు ప్రమాదం జరగడంలో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు పక్కకు తీసిట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.


Next Story

Most Viewed