అప్పుడే పుట్టిన బిడ్డను రైలు టాయిలెట్‌లో వదిలి వెళ్లిన తల్లి...!

by Disha Web Desk |
అప్పుడే పుట్టిన బిడ్డను రైలు టాయిలెట్‌లో వదిలి వెళ్లిన తల్లి...!
X

దిశ, వెబ్‌డెస్క్ : తల్లిని మించిన దైవం లేదంటుంటారు. కానీ ఈ రోజుల్లో కొంత మంది తల్లులు కఠినాత్మురాల్లుగా ప్రవర్తిస్తున్నారు. సమాజం ఎంత అభివృద్ధి చెందినా ఆడపిల్లల విషయాలల్లో మార్పు రావడం లేదు . ఆడపిల్ల అనగానే చెత్తకుప్పల్లో వదిలేస్తున్నారు కొందరు తల్లులు. అలాంటి ఘటనే విశాఖపట్టణం రైలులో చోటుచేసుకుంది.

విశాఖపట్టణం బొకారా ఎక్స్ ప్రెస్ రైలులో ఓ గుర్తు తెలియని మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. అప్పుడే పుట్టిన ఆ శిశువును రైలు టాయిలెట్‌లోనే వదిలేసి వెళ్లింది. బొకారో ఎక్స్ ప్రెస్ రైలు వైజాగ్ స్టేషన్‌కు రావడానికి ముందు టాయిలెట్‌లో నుంచి అరుపులు వినిపించడంతో ప్రయాణికులు వెళ్లి చూడగా.. అప్పుడే పుట్టిన పసికందు కంటపడింది. వెంటనే బిడ్డను టాయిలెట్‌లో నుంచి బయటికి తీసిన ప్రయాణికులు.. రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి వచ్చిన పోలీసులు పాపను పరీక్షించి స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై అధికారులు ఆరా తీసుకున్నారు. సీసీ కెమెరాలతో తల్లి ఆచూకీ కనుగోనేందుకు ప్రయత్నిస్తున్నారు.


Next Story

Most Viewed