Visakha: జయపురం మహారాణి అంత్యక్రియలు పూర్తి

by Disha Web Desk 16 |
Visakha: జయపురం మహారాణి అంత్యక్రియలు పూర్తి
X

దిశ, ఉత్తరాంధ్ర: ఒడిశాలోని జయపురం చివరి మహారాణి, వి. మాడుగుల మాజీ ఎమ్మెల్యే రమాకుమారిదేవి(93) అంత్యక్రియలు నిరాడంబరంగా జరిగాయి. రాజభవనం మోతీ ప్యాలెస్‌లో ఆమె తుది శ్వాస విడిచారు. మహారాజా విక్రం దేవ్ సోదరుడు రామకృష్ణ చంద్ర దేవ్ భార్య అయిన రమా కుమారి దేవి 1962లో ఉమ్మడి విశాఖ జిల్లాలోని వి. మాడుగుల నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే పోటీ చేసి గెలిచారు. ఆమె పాలించిన 1951-52 సమయంలో మోతీ ప్యాలెస్ (జయపురం) హవా మహల్ నిర్మించారు. ఆమె అంత్యక్రియలు చందన్వాడలోని రాజ శ్మశానంలో రాజవంశీయులు, యువరాజ్ విశ్వేశ్వర చంద్ర ఛూడ్ దేవ్, మహారాణి సారికాదేవి చేతుల మీదుగా జరిగాయి. జయపురం జిల్లా కలెక్టర్‌తో పాటు ఊరి పెద్దలు, స్థానికులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


Next Story

Most Viewed