Tirumala: పరకామణిలో రూ. 100 కోట్ల స్కాం.. డీజీపీకి ఫిర్యాదు

by Vemula.Srinu Prasad |   (  Updated:2024-12-28 06:51:20  IST  )

తిరుపతి పరకామణిలో జరిగిన భారీ స్కామ్‌పై రాష్ట్ర డీజీపీ తిరుమలరావుకు టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాశ్ రెడ్డి ఫిర్యాదు చేశారు...

Tirumala: పరకామణిలో రూ. 100 కోట్ల స్కాం.. డీజీపీకి ఫిర్యాదు
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల పరకామణి(Parakamani)లో రూ. 100 కోట్ల స్కామ్(Scam) జరిగిందని, సమగ్ర విచారణ జరపాలని టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి(TTD Board Member Bhanu Prakash Reddy) డిమాండ్ చేశారు. పరామణిలో జరిగిన స్కామ్‌పై ఇవాళ తన బృందంతో ఆయన అమరావతిలో(Amaravati) డీజీపీ తిరుమలరావు(DGP Tirumalarao)కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు భానుప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ టీటీడీ పరకామణిలో డాలర్లు మాయం అయ్యాయని, ఆ ఘటనపై విచారణ చేయాలని డీజీపీని కోరినట్లు తెలిపారు. ఆ స్కామ్‌పై నాలుగు పేజీల ఫిర్యాదు లేఖను డీజేపీకి అందజేసినట్లు చెప్పారు. పరకామణిలో రూ. 100 కోట్ల స్కామ్ జరిగిందని, ఆ డబ్బులను రహస్య అర అమర్చి అందులో పెట్టారని, తరలించిన డబ్బు మొత్తాన్ని వెనక్కి రప్పించాలని డీజీపీ తిరుమల రావును కోరినట్లు భాను ప్రకాశ్ రెడ్డి తెలిపారు.

Next Story