పల్నాడు జిల్లాలో విషాదం..కాలువలో పడి ఇద్దరు పిల్లలు మృతి

by Disha Web Desk 16 |
పల్నాడు జిల్లాలో విషాదం..కాలువలో పడి ఇద్దరు పిల్లలు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెదనందిపాడు బ్రాంచ్ కాలువలో ప్రమాదవశాత్తు ఇద్దరు పిల్లలు పడ్డారు. పడిన వెంటనే నీటిలో ముగిపోయారు. స్థానికులు రక్షించే ప్రయత్నం చేశారు.అయినా ఫలితం లేకుండా పోయింది. ఇద్దరు పిల్లలు క్షణాల్లోనే మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఘటన నాదెండ్ల మండలం తూబాడులో జరిగింది.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పిల్లల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వేసవి తాపంలో సేదతీరేందుకు చెరువులు, కాలువలు, కుంటలు, వద్దకు పెద్దలు, విద్యార్థులు, పిల్లలు వెళ్లొద్దని.. ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈతరాని వాళ్ల అసలు అటు వైపు కూడా వెళ్లవద్దని సూచించారు.ఎవరైనా వెళ్లాలంటే పెద్ద వాళ్ల సమక్షంలో తగిన జాగ్రతలు తీసుకోవాలని పోలీసులు సూచించారు.



Next Story

Most Viewed