రెండు సింహాల మధ్య నలిగిపోతావ్.. జగన్‌కు లోకేశ్ హెచ్చరిక

by Disha Web Desk 16 |
రెండు సింహాల మధ్య నలిగిపోతావ్.. జగన్‌కు లోకేశ్ హెచ్చరిక
X

దిశ, వెబ్ డెస్క్: సింహం సింగిల్‌గా వస్తుందన్న వైసీపీ నేతల వ్యాఖ్యలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రలో రెండు సింహాలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ అని ఆయన వ్యాఖ్యానించారు. ఏలూరులో యువగళం నిర్వహించిన ఆయన సీఎం జగన్‌పై సెటైర్లు వేశారు. జగన్ టైమ్ అయిపోయిందని, మే 13న రెండు సింహాల మధ్య నలిగిపోవడం ఖాయమని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో డ్రామాలాడటం జగన్ సహజమేనని ఎద్దేవా చేశారు. మొన్న కోడికొత్త అని, నిన్న గొడ్డలి, ఇప్పుడు గులక రాయి డ్రామా అని విమర్శించారు. సినిమాల్లోకి వెళ్తే జగన్ కు ఆస్కార్ అవార్డు కన్నా భాస్కర్ అవార్డు కచ్చితంగా వస్తుందని నారా లోకేశ్ సలహా ఇచ్చారు. జగన్ తీసుకొచ్చింది ల్యాండ్ టైటిలింగ్ యాక్టు కాదని, ట్యాండ్ గ్రాబింగ్ చట్టమని ఎద్దేవా చేశారు. తనపై జగన్ తనపై ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడేది లేదన్నారు. ఇంకెతకాలం ఉద్యోగులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాలనని ప్రశ్నించారు. రాజధాని లేని రాష్ట్రంలో ఏపీ ఎంతకాలం ఉండాలని లోకేశ్ నిలదీశారు.

Next Story

Most Viewed