ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల.. ఎప్పుడంటే..!

by Disha Web Desk 16 |
ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల.. ఎప్పుడంటే..!
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 22న (సోమవారం) విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అదే రోజు ఉదయం 11 గంటలకు పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల చేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ తెలిపారు. కాగా మార్చి నెలలో పదో తరగతి పరీక్షలు జరిగాయి. మార్చి 18నుంచి 30వ తేదీ వరకూ అధికారులు ఎగ్జామ్స్ నిర్వహించారు. దాదాపు 6 లక్షల 23 వేల 92 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. గతంలో ఫెయిలైన లక్షా 2 వేల 528 మంది విద్యార్థులు మళ్లీ పరీక్షలు రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా 3473 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. తాజాగా టెన్త్ పరీక్షల ఫలితాలు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.



Next Story