టీడీపీకి షాక్:ధూళిపాళ్ల నరేంద్రపై కేసు

by Disha Web Desk 21 |
టీడీపీకి షాక్:ధూళిపాళ్ల నరేంద్రపై కేసు
X

దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు షాక్ తగిలింది. పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం రంగాపురం వాసి ముసునూరి రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ నెల 15న సంగం డెయిరీ వద్ద తమపై దాడి చేశారని రాము ఫిర్యాదు చేశారు. పాల విక్రయానికి సంబంధించి బోనస్ 14 శాతం ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. ధూళిపాళ్ల నరేంద్ర డెయిరీ వద్దకు మాట్లాడదామని పిలిచి దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ దాడిలో తమ మూడు కార్లు ధ్వంసం అయ్యాయని పోలీసులకు ఫిర్యాదులో వెల్లడించారు. కర్రలు, హాకీ స్టిక్స్‌తో దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ముసునూరి రాము ఫిర్యాదు మేరకు చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేశారు. ధూళిపాళ్ల నరేంద్రను 14వ నిందితుడిగా ఎఫ్ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story