కుటుంబ సభ్యులకు వరుస పురస్కారాలు.. నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్

by Muthe.Rajitha |

ఏపీ మంత్రి నారా లోకేష్ తన కుటుంబ సభ్యులకు వరుసగా అవార్డులు రావడంపై ఆసక్తికర ట్వీట్ చేశారు.

కుటుంబ సభ్యులకు వరుస పురస్కారాలు.. నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ మంత్రి నారా లోకేష్ తన కుటుంబ సభ్యులకు వరుసగా అవార్డులు రావడంపై ఆసక్తికర ట్వీట్ చేశారు. "నాన్నగారు ‘బిజినెస్‌ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు గెలుచుకున్నారు. అమ్మగారు ‘గోల్డెన్ పీకాక్’ అవార్డును సొంతం చేసుకున్నారు. భార్య భారతదేశంలోని ‘బిజినెస్‌లో అత్యంత శక్తివంతమైన మహిళల’ జాబితాలో చోటు దక్కించుకుంది. ఎన్నికల్లో ప్రత్యర్థులతో పోటీ చేయడం కంటే, కుటుంబ సభ్యులతోనే పోటీ పడటం కష్టంగా ఉంది" అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. కుటుంబ సభ్యులు సాధించిన విజయాలపై గర్వంగా ఉందని, వారు సాధిస్తున్న గుర్తింపులు తనకు మరింత ప్రేరణనిస్తున్నాయని లోకేష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Next Story