వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి ఆ రూట్‌లో ఆంక్షలు

by Disha Web Desk 16 |
వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఆదివారం  ఉదయం 10 గంటల నుంచి ఆ రూట్‌లో ఆంక్షలు
X

దిశ, వెబ్ డెస్క్: బాపట్ల జిల్లా మేదరమెట్లలో ఆదివారం వైసీపీ సిద్ధం సభ జరగనుంది. ఈ సభకు దాదాపు 15 లక్షల మందిని ఆ పార్టీ నేతలు తరలిస్తున్నారు. దీంతో సభా స్థలాన్ని పెద్ద ఎత్తున నిర్మించారు. దాదాపు 500 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. ఈ సభకు గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల నుంచి కార్యకర్తలను తరలిస్తున్నారు. ఈ సభ ద్వారా వైసీపీ క్యాడర్‌ను సీఎం జగన్ ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. భారీ సంఖ్యలో వైసీపీ శ్రేణులు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రయాణికులు, వాహదారులు ఇబ్బందులు పడకుండా వాహనాలను దారి మళ్లించారు. నెల్లూరు వైపు నుంచి ఒంగోలు మీదుగా హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలను ఒంగోలు సౌత్ బైపాస్ నుంచి కర్నూలు రోడ్డు, చీమకుర్తి, పొదిలి, దొనకొండ అడ్డరోడ్డుమీదుగా దారి మళ్లించారు. హైదరాబాద్ నుంచి ఒంగోలు వైపు వెళ్లే భారీ వాహనాలను సంతమాగులూరు అడ్డరోడ్డు, వినుకొండ, మార్కాపురం, చీమకుర్తి మీదుగా దారి మళ్లించారు. నెల్లూరు వైపు నుంచి ఒంగోలు మీదుగా వెళ్లే సాధారణ వాహనాలను మేదరమెట్ట నుంచి నామ్ హైవేపై అద్దంకి, సంతమాగులూరు మీదుగా దారి మళ్లించారు.

ఒంగోలు నుంచి విశాఖ వైపు వెళ్లే వాహనాలను త్రోవగుంట, చీరాల, బాపట్ల, మచిలీపట్నం మీదుగా దారి మళ్లించారు. ఒంగోలు-విజయవాడ-గుంటూరు వాహనాలను త్రోవగుంట, చీరాల, బాపట్ల, పొన్నూరు మీదుగా దారి మళ్లించారు. ఒంగోలు-చిలకలూరిపేట వెళ్లే వాహనాలను చీరాల, త్రోవగుంట, చీరాల, పర్చూరు మీదుగా దారి మళ్లించారు. విశాఖ-ఒంగోలు-చెన్నై వాహనాలను నర్సాపురం, మచిలీపట్నం, బాపట్ల, చీరాల, త్రోవగుంట మీదుగా దారి మళ్లించారు. గుంటూరు-ఒంగోలు- చెన్నై వెళ్లే వాహనాలను బుడంపాడు అడ్డరోడ్డు నుంచి పొన్నూరు, బాపట్ల, చీరాల, త్రోవగుంట మీదుగా దారి మళ్లించారు. చిలకలూరిపేట-ఒంగోలు-నెల్లూరు వెళ్లే వామనాలను పర్చూరు, చీరాల, త్రోవగుంట మీదుగా దారి మళ్లించారు.


Next Story

Most Viewed