వైసీపీ కోసం కాదు.. ప్రజల కొరకు పని చేయండి.. అధికారులకు Atchannaidu వార్నింగ్

by Disha Web Desk 16 |
వైసీపీ కోసం కాదు.. ప్రజల కొరకు పని చేయండి.. అధికారులకు Atchannaidu వార్నింగ్
X

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలోని కొందరు అధికారుల పనితీరుపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతల మెుప్పుకోసం కొందరు అధికారులు పనిచేస్తున్నారని ఆరోపించారు. అలాంటి అధికారులను టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపేక్షించే ప్రసక్తేలేదని హెచ్చరించారు. ఈ మేరకు ట్వీటర్ వేదికగా వార్నింగ్ ఇచ్చారు.'మునిసిపల్, రెవిన్యూ, పోలీస్ అధికారులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో 27వ వార్డు ఉల్లాసపేట (శ్రీనివాస నగర్) లో 2001 లో పట్టాలు ఇచ్చిన స్థలంలో ఇళ్ళు నిర్మించుకొని పేదలు నివాసముంటున్నారు.స్థానికంగా జరుగుతున్న భూకబ్జాలను ఇక్కడి టీడీపీ కౌన్సిలర్ ప్రశ్నిస్తున్నారు అని, రాజకీయ కక్షతో పేదల ఇళ్ళు పడగొట్టడానికి వచ్చారు.

అక్రమ కూల్చివేతలను అడ్డుకున్న ఒక గౌరవ ఎమ్మెల్యేతో ప్రవర్తించే విధానం ఇదేనా? పేద ప్రజల పక్షాన, న్యాయం వైపున నిలబడటమే ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబు చేసిన నేరమా?' అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. 'నాడు దళిత డ్రైవర్‌ను చంపి ఇంటికి డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీకి మీరు చేసిన రాచ మర్యాదలు, నేడు పేదల తరపున నిలబడ్డ టీడీపీ ఎమ్మెల్యేతో మీ ప్రవర్తన అన్నీ ప్రజలు గమనిస్తున్నారు. అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే అధికారులు అందరూ మీ చర్యలకు, భవిష్యత్‌లో న్యాయస్థానాల్లో జవాబు చెప్పాల్సి ఉంటుంది' అని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.



Next Story

Most Viewed