మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం 30 వేల కోట్లను దోచుకుంది: చంద్రబాబు

by Disha Web Desk 12 |
మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం 30 వేల కోట్లను దోచుకుంది: చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 13న పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల పోలింగ్ కు సరిగ్గా మరో ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు ప్రచార హోరు చూపిస్తున్నాయి. ఈ క్రమంలో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి కుటుంబం ఇసుక, మద్యం వ్యాపారాలతో 30 వేల కోట్లు దోచుకుందని బాబు విమర్శించారు. ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా పుంగనూరులో పర్యటించిన చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే జగన్ రెడ్డి సీఎం అయ్యాక రాష్ట్రంలో మద్యం, కరెంట్, పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయని మండిపడ్డారు. రాష్ట్రంలో విపరీతంగా పెంచిన మద్యం ధరల్లో జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి వాటా ఎంతో చెప్పాలని అన్నారు. అలాగే జూన్ 4 తర్వాత తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. వారి నుంచి అవినీతి సొమ్మును బయటకు తీస్తామని చంద్రబాబు తెలిపారు.

Next Story