ఐటీ నోటీసులపై చంద్రబాబు ఎందుకు స్పందించరు: Amarnath

by Disha Web Desk 16 |
ఐటీ నోటీసులపై చంద్రబాబు ఎందుకు స్పందించరు: Amarnath
X

దిశ, వెబ్ డెస్క్: ఐటీ శాఖ నోటీసులపై చంద్రబాబు ఎందుకు మాట్లాడటంలేదని మంత్రి అమర్‌నాథ్ ప్రశ్నించారు. రాజధాని పేరుతో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. టీడీపీ హయాంలో ప్రజల సొమ్మును చంద్రబాబు దోచుకున్నారని మండిపడ్డారు. కేసులు నుంచి తప్పించుకోవడానికే చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీతో సైతం పొత్తులు కూడా పెట్టుకుంటున్నారని విమర్శించారు. టీడీపీ చేపట్టబోయే ‘భవిష్యత్తుకు గ్యారంటీ’ కార్యక్రమం చంద్రబాబు అవినీతికి గ్యారంటీ అని మంత్రి అమర్‌నాథ్ సెటైర్లు వేశారు. ప్రత్యేక హోదాను చంద్రబాబు ఢిల్లీలో తాకట్టు పెట్టారన్నారు. కేంద్రం కాళ్లు మొక్కడానికే చంద్రబాబు ఢిల్లీ యాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ నాణెం విడుదల సందర్భంగా చంద్రబాబును ఎక్కడ కూర్చోబెట్టారో ప్రపంచం మొత్తం చూసిందని మంత్రి అమర్‌నాథ్ విమర్శించారు.

Next Story

Most Viewed