Nandikotkur: వివాహిత దారుణ హత్య.. మాజీ భర్తపై అనుమానం

by Disha Web Desk 16 |
Nandikotkur: వివాహిత దారుణ హత్య.. మాజీ భర్తపై అనుమానం
X

దిశ, నందికొట్కూరు అర్బన్: వివాహిత దారుణ హత్యకు గురైన ఘటన నందికొట్కూరు మారుతీ నగర్‌లో జరిగింది. కొత్తపల్లె మండలం ఎర్రమఠం గ్రామానికి చెందిన సత్యాలు, లలితమ్మ దంపతుల రెండో కుమార్తె రాములమ్మను పగిడ్యాలకు చెందిన బాలయ్యకు ఇచ్చి 18 ఏళ్ల క్రితం వివాహం చేశారు. కొంత కాలం వీరి సంసారం సాఫిగా సాగింది. ఆ తర్వాత భార్యా భర్తల మధ్య నెలకొన్న కలహాల కారణంగా రాములమ్మ భర్తకు దూరంగా ఉంటున్నారు.

అయితే గత సంవత్సరం నందికొట్కూరుకి చెందిన వ్యక్తితో రాములమ్మ వివాహం చేసుకుని మారుతీనగర్‌లో ఉంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో గుర్తు తెలియని దుండగులు ఒంటరిగా ఉన్న వివాహితను గొంతు కోసి హతమార్చారు. మంచంపై రక్తపు మడుగులో విగత జీవిగా పడి ఉన్న రాములమ్మను చూసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు రాములమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మొదటి భర్త చేశాడా? లేక రెండో భర్త చేశాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed