AP News:టీడీపీ నినాదాలతో హోరెత్తిన గుంటూరు

by Disha Web Desk 18 |
AP News:టీడీపీ నినాదాలతో హోరెత్తిన గుంటూరు
X

దిశ ప్రతినిధి,గుంటూరు: నగరంలో సోమవారం టీడీపీ నేతలు, కార్యకర్తల నినాదాలతో హోరెత్తింది. నగరంలోని ప్రధాన మార్గాలన్ని పసుపుమయం అయ్యాయి. పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్ర శేఖర్, గల్లా మాధవిలకు జిందాబాద్ లతో నగరం హోరెత్తింది. టీడీపీ అభ్యర్థులు ఇద్దరు నామినేషన్లు వేసేందుకు 7 అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ నేతలు, శ్రేణులతో బాణా సంచాతో ధూమ్ ధాం గా ర్యాలీ జరిగింది. రిటర్నింగ్ అధికారి కార్యాలయంకు చేరుకున్నారు. ప్రచార రథంపై పెమ్మసాని, మాధవి లత,శ్రీ రత్న,కోవెలమూడి రవీంద్ర ఇతర నాయకులు ప్రజలకు అభివాదం చేశారు.పెమ్మసాని కలెక్టర్‌కు,మాధవి లత ఆర్.డీ.ఓ.లకు నామినేషన్ పత్రాలు అందజేశారు.

నా గెలుపు ఖాయం..

గుంటూరు ఎంపీ టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన తర్వాత పెమ్మసాని మీడియా తో మాట్లాడుతూ..నామినేషన్ కార్యక్రమానికి హాజరైన అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పెద్ద ఎత్తున తరలి వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేశారంటూ,ర్యాలీ కారణంగా ట్రాఫిక్ సమస్య తలెత్తి ఇబ్బంది పడిన వారికి క్షమాపణలు చెప్పారు. ఇదే స్ఫూర్తి పోలింగ్ రోజున కూడా కొనసాగించాలని పెమ్మసాని కోరారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి అమరావతికి జరిగిన అన్యాయానికి ప్రజలు బదులు చెప్పాలని చెప్పారు. నా గెలుపు ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. మెజార్టీ పైనే దృష్టి పెట్టమని ఎంతో ఆత్మ విశ్వాసంతో చెప్పుకొచ్చారు. ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకం వమ్ము కాకుండా పని చేస్తాను అని పెమ్మసాని చంద్ర శేఖర్ ప్రజలకు మాట ఇచ్చారు.



Next Story