- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Chandrababu: వైసీపీకి గుండు సున్నా.. పులివెందులోనూ ఖాయమే..!
దిశ, డైనమిక్ బ్యూరో: 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ (Ycp)కి 175 చోట్ల గుండుసున్నా తప్పదని జోస్యం చెప్పారు. చివరికి సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులోనూ వైసీపీకి ఓటమి తప్పదని చంద్రబాబు అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆక్వా రైతులకు 'ఇదేం ఖర్మ' సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కర్నూలు పర్యటనకు తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడని స్పందన వచ్చిందన్నారు. ఆ పర్యటనలో యువత, ప్రజలు భారీగా తరలివచ్చి సంఘీభావం తెలిపారని చెప్పారు. అందుకే వైసీపీలో ప్రకంపనలు ప్రారంభమయ్యాయని...8 మంది జిల్లాల అధ్యక్షుల్ని మార్చేశారని చంద్రబాబు ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలిపేయాలని పిలుపునిచ్చారు. వనరులు, తెలివితేటలు మనకున్నా రాష్ట్రానికి పట్టిన ఖర్మకు ఏకైక కారణం వైఎస్ జగన్ అని విమర్శించారు. మనుషులుగా తప్పులు చేయటం సహజం కానీ ఆ తప్పులు సరిదిద్దుకోకుంటే మనిషికి పశువుకు తేడా లేదన్నారు. వాస్తవాలు గ్రహించి సమస్యలు పరిష్కరించకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, వైసీపీ నేతల అక్రమాలు ప్రజలకు వివరించి వారిలో చైతన్యం తెచ్చేందుకు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి: