‘ఆడుదాం, ఆంధ్రా’లో సిక్సులు, ఫోర్లతో అదరగొట్టిన మంత్రి అమర్‌నాథ్

by Disha Web Desk 16 |
‘ఆడుదాం, ఆంధ్రా’లో  సిక్సులు, ఫోర్లతో అదరగొట్టిన మంత్రి అమర్‌నాథ్
X

దిశ, వెబ్ డెస్క్: యువతలో దాగి ఉన్న క్రీడలను బయటకు తీసేందుకు ‘ఆడుదాం ఆంధ్రా’పేరుతో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా విశాఖ డీఎల్బీ గ్రౌండ్‌లో క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. అమర్, కేకేఆర్ లెవన్ మధ్య మ్యాచ్ జరిగింది. అమర్ లెవన్ టీమ్‌కు మంత్రి అమర్ నాథ్ కెప్టెన్సీ వహించగా కేకేఆర్ లెవన్‌కు నార్త్ కో ఆర్డినేటర్ కేకే రాజు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఈ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో మంత్రి అమర్‌నాథ్ రెచ్చిపోయి బ్యాటింగ్ చేశారు. రెండు సిక్సులు, రెండు ఫోర్లతో మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. అద్భుత బ్యాటింగ్‌తో 28 పరుగులు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి అమర్ నాథ్ మాట్లాడుతూ ‘ఆడుదాం-ఆంధ్రా’ను విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల, మతాలకు అతీతంగా జరిగే క్రీడలపై దుష్ట్రచారం చేయడం బాధాకరమని మంత్రి అమర్ నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed