తిరుపతి జిల్లాలో 15 ఏనుగుల బీభత్సం..80 ఎకరాల్లో మామిడి తోటల ధ్వంసం

by Disha Web Desk 16 |
తిరుపతి జిల్లాలో 15 ఏనుగుల బీభత్సం..80 ఎకరాల్లో మామిడి తోటల ధ్వంసం
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి జిల్లా రేణిగుంట మండలం మాముండూరులో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గ్రామానికి ఆనుకొని ఉన్న మామిడి తోటలపై రెండు రోజులుగా 15 ఏనుగుల గుంపు పడి ధ్వంసం చేశాయి. దాదాపు 80 ఎకరాల్లో మామిడి తోటలను ధ్వంసం చేశాయి. అటవీ శాఖ అధికారులకు రైతులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో ఏనుగుల మందను చెల్లాచెదురు చేసేందుకు స్థానిక రైతులు బాణసంచా పేల్చారు. అయినా లాభం లేదు. మామిడి తోటల సమీపలో ఏనుగుల గుంపు తిష్ట వేశాయి. రాత్రి అయితే చాలు మామిడితోటల్లోకి వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏనుగులకు తరిమివేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

Next Story