లారీ-తెలంగాణ ఆర్టీసీ బస్సు ఢీ.. 8 మందికి గాయాలు

by Vemula.Srinu Prasad |

లారీ- తెలంగాణ ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో 8 మందికి గాయాలయిన ఘటన రాష్ట్రంలో జరిగింది....

లారీ-తెలంగాణ ఆర్టీసీ బస్సు ఢీ.. 8 మందికి గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్: లారీ- తెలంగాణ ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో 8 మందికి గాయాలయిన ఘటన రాష్ట్రంలో జరిగింది. మిర్యాలగూడ నుంచి దాచేపల్లికి బయల్దేరిన బస్సు.. పల్నాడు జిల్లా శ్రీనగర్ వద్దకు వెళ్లగానే ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story