శ్రీవారి సేవలో పాల్గొన్న ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ చిత్రబృందం..

by Disha Web Desk 18 |
శ్రీవారి సేవలో పాల్గొన్న ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ చిత్రబృందం..
X

దిశ,తిరుమల: శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ చిత్రబృందం సభ్యులు దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో చిత్ర కథానాయకి అంజలి, కథానాయకుడు శ్రీనివాస్ రెడ్డి, చిత్ర దర్శకుడు శివ, చిత్ర రచయిత కోన వెంకట్‌లు స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు సమర్పించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రాలతో సత్కరించారు.

ఆలయం వెలుపల చిత్ర బృందం సభ్యులు మాట్లాడుతూ..సినిమాకు ప్రేక్షకుల వద్ద నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందన్నారు. గీతాంజలి హిట్ అయినా విధంగా గీతాంజలి మళ్లీ వచ్చింది కూడా ఘన విజయం సాధిస్తుందన్నారు. ఇక గ్యాంగ్ ఆఫ్ గోదావరి, గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నట్లు అంజలి తెలిపారు. డైరెక్టర్ మాట్లాడుతూ.. అందరికీ ఉగాది శుభాకాంక్షలు, అలాగే గీతాంజలి ఎంత విజయం సాధించిందో మరలా గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా కూడా అంత విజయం సాధించాలని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించానన్నారు.

Next Story

Most Viewed