BREAKING: ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై ముగిసిన విచారణ.. తీర్పు రిజర్వు చేసిన తెలంగాణ హై‌కోర్టు

by Disha Web Desk 1 |
BREAKING: ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై ముగిసిన విచారణ.. తీర్పు రిజర్వు చేసిన తెలంగాణ హై‌కోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో సంచలనం సృష్టించిన వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ.. తెలంగాణ హైకోర్టులో దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరుపక్షల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వు చేసింది. అయితే, అవినాష్ రెడ్డి కోర్టు షరతులు ఉల్లంఘించాడంటూ దస్తగిరి తన పిటిషన్‌లో తెలిపాడు. అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులను వేధిస్తున్నారంటూ కోర్టుకు తెలిపాడు. కేసు నుంచి అవినాష్‌ను తప్పిస్తే రూ.20 కోట్లు ఇస్తామంటూ తనను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని దస్తగిరి వెల్లడించారు. అయితే, కోర్టు దస్తగిరి వాదనలను సమర్థిస్తున్నారా.. వ్యతిరేకిస్తున్నారా అని సీబీఐని ప్రశ్నించగా, సీబీఐ తరఫు న్యాయవాది సమర్థిస్తున్నామని బదులిచ్చారు.

కాగా, ఇన్నాళ్లు అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుకు కోర్టును ఎందుకు ఆశ్రయించలేదని సీబీఐని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. అందుకు సమాధానంగా తమ కంటే ముందే వివేకానంద రెడ్డి కూతురు సునీతారెడ్డి సుప్రీం కోర్టుకు వెళ్లారని సీబీఐ ధర్మాసనానికి తెలిపింది. సుప్రీంలో ఆమె పిటిషన్‌పై విచారణ సందర్భంగా తమ వాదనలు వినిపిస్తామని సీబీఐ వివరణ ఇచ్చింది. దస్తగిరి ఫిర్యాదుపై చట్టపరంగా విచారణ జరుపుతున్నామని వెల్లడించింది. ఇరు పక్షాల వాదనలను విన్న హైకోర్టు దస్తగిరి పిటిషన్‌పై తదుపరి విచారణను ఏప్రిల్ 15కు వాయిదా వేసింది. అయితే, నేడు ఇరు పక్షాల వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వు చేస్తున్నట్లుగా తెలిపింది.

Next Story