Police custody: పోలీసు కస్టడీకి .. పేలుళ్ల కుట్ర నిందితులు

by Thanuru Gopichand |   (  Updated:2025-05-23 06:58:57  IST  )

హైదరాబాద్​లో పేలుళ్లకు కుట్ర చేసిన ఇద్దరు నిందితులు సిరాజ్​, సమీర్​ను పోలీసులు ఈ రోజు కస్టడీలోకి తీసుకున్నారు.

Police custody: పోలీసు కస్టడీకి .. పేలుళ్ల కుట్ర నిందితులు
X

విశాఖనుంచి బారీ బందోబస్తు నడుమ విజయనగరానికి తరలింపు

నేటి నుంచి ఏడు రోజులపాటు విచారణ

విచారణ చేపట్టనున్న ఏపీ పోలీసులు, ఎన్​ఐఏ అధికారులు

దిశ, డైనమిక్​ బ్యూరో : హైదరాబాద్​లో పేలుళ్లకు కుట్ర చేసిన ఇద్దరు నిందితులు సిరాజ్​, సమీర్​ను పోలీసులు ఈ రోజు కస్టడీలోకి తీసుకున్నారు. కొద్దిజేపటి కిందట విజయనగరం పోలీసులు విశాఖపట్నం సెంట్రల్​జైలు నుంచి వారిని కస్టడీ లోకి తీసుకున్నారు. వారిద్దరినీ గట్టి బందోబస్తు మధ్య రెండు వాహనాల్లో విజయనగరం తరలించారు. వారిని కస్టడీకి కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటీషన్​పై కోర్టులో నిన్న విచారణ జరిగింది. వారి కస్టడీకి సంబంధించిన తీర్పు ఉత్తర్వులు పొద్దుపోయాక రావడంతో ఈ ఉదయం వారిని పోలీసులు కస్టడీకి తరలించారు. ఉగ్రదాడులకు సంబంధించిన వ్యక్తులు కావడంతో వారు ప్రయాణించే 40 కిలోమీటర్ల దారిలో భారీ నిఘా ఏర్పాటు చేశారు.

విజయనగరం టూటౌన్​పోలీసులు విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్​ఐఏ (NIA) అధికారులు విజయనగరానికి చేరుకున్నారు. ఏడురోజులపాటు వీరి విచారణ జరగనుంది. పేలుళ్లకు ఎటుంటి ప్రయత్నాలు చేశారు.. దీని వెనుక ఎవరు ఉన్నారు..? హైదరాబాద్​కు చెందిన కొందరితో వీరు గతంలో కలిసి ఉండడం అక్కడ పేలుళ్లకు కుట్ర చేయడం వంటివి విచారించనున్నారు. ఉగ్రవాదులతో చేతులు కలిపి వీరు భారీ కుట్రం చేశారనే విషయాలు వెలుగులోకి వస్తున్న క్రమంలో పూర్తి స్థాయిలో విచారణ చేయనున్నారు. వారిద్దరినీ విజయనగరం పోలీసు శిక్షణ కళాశాలకు తరలించారు. ఇన్​చార్జి ఎస్పీ మాధవరెడ్డి అక్కడికి చేరుకున్నారు.

Next Story