ఏపీలో రెండు కుటుంబాలే పాలిస్తున్నాయి : బీజేపీ ఎంపీ

by Disha Web Desk 13 |
ఏపీలో రెండు కుటుంబాలే పాలిస్తున్నాయి : బీజేపీ ఎంపీ
X

దిశ, ఏపీ బ్యూరో: మహాత్మా గాంధీ ని ఆదర్శంగా తీసుకుని మోదీ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరహింహారావు అన్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా విశాఖలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గాంధీ, భగత్ సింగ్, పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి వంటి మహనీయులను బీజేపీ ఎంతో గౌరవిస్తుందని తెలిపారు. గాంధీకి ఖాదీని అత్యంత ఇష్టపడేవారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ నిర్మాణాలకు మహనీయుల పేర్లు పెట్టాలని సూచించారు. ఏపీలో రెండు కుటుంబాలే పాలిస్తున్నాయని తెలిపారు. అన్నిటికి పాలకుల పేర్లే పెట్టుకుంటున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రం కోసం త్యాగాలు చేసిన వారిని గుర్తుపెట్టుకోవాలని వారి త్యాగాలను ముందు తరాలు తెలుసుకునేలా చేయాలని జీవీఎల్ అన్నారు.


Next Story

Most Viewed