తప్పులు బయటపెట్టిన జర్నలిస్ట్‌కు బెదిరింపులు.. ఎస్పీకి APUWJ ఫిర్యాదు

by Disha Web Desk 18 |
తప్పులు బయటపెట్టిన జర్నలిస్ట్‌కు బెదిరింపులు.. ఎస్పీకి APUWJ ఫిర్యాదు
X

దిశ ప్రతినిధి,అనంతపురం: జర్నలిస్ట్ మల్లేష్‌ను కొందరు టీచర్లు బెదిరిస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని APUWJ ఆధ్వర్యంలో పలువురు జర్నలిస్టులు బుధవారం జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా APUWJ నాయకులు మాట్లాడుతూ..రెండు రోజుల క్రితం అనంతపురం రూరల్ మండలం తాటిచెర్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు మల్లేష్ వెళ్లగా అక్కడ పలు అక్రమాలు వెలుగు చూశాయన్నారు. వాటిపై వార్త రాశాడనే నెపంతో కొందరు టీచర్లు సంబంధిత జర్నలిస్టును బెదిరిస్తున్నారని ఆరోపించారు. దీనిపై విచారించి పాత్రికేయులకు రక్షణ కల్పించాలని కోరామన్నారు. ఇందుకు జిల్లా ఎస్పీ సానుకూలంగా స్పందించి.. విచారించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో APUWJ నాయకులు మార్కండేయులు, చౌడప్ప, చలపతి, అక్కులప్ప తో పాటు షఫీ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed