- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
వలంటీర్లపై కూటమి నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు: ఆళ్ల నాని
దిశ, ఏలూరు: ప్రజలకు సంక్షేమం దూరం చేసేందుకు కుటిల బుద్ధితో చంద్రబాబు కూటమి.. వలంటీర్ల పై లేనిపోని ఆరోపణలు, అభాండాలు వేస్తూ కించపరుస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని ఆరోపించారు. స్థానిక 29 డివిజన్కు చెందిన 27 మంది వాలంటీర్లు స్వచ్చందంగా రాజీనామా చేసి, శ్రీరామ్ నగర్లోని తన క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆళ్ల నాని నీ కలిశారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు సంక్షేమం అందించే అనుసంధాన కర్తలు, సేవకులు వాలంటీర్లు అని ప్రశంసించారు. ప్రజలకు సంక్షేమం దూరం చేసేందుకే చంద్రబాబు కూటమి వలంటీర్ల పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. రానున్న ప్రభుత్వంలో జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వాలంటీర్ వ్యవస్థ పునరుద్ధరణ చేసి, ఊహించని రీతిలో వాలంటీర్లకు జీవితాలు మెరుగు పడే విధంగా రూపకల్పన చేస్తారని, ఆళ్ల నాని భరోసా ఇచ్చారు.