లోయలో వాహనం బోల్తా.. 18 మంది కూలీలకు తీవ్ర గాయాలు

by Vemula.Srinu Prasad |

అల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది..

లోయలో వాహనం బోల్తా.. 18 మంది కూలీలకు తీవ్ర గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్: అల్లూరు జిల్లా(Allur District)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. జి.మాడుగుల(G. Madugala) వద్ద అదుపు తప్పి వాహనం(Vehicle) లోయలో పడింది. ఈ ఘటనలో మొత్తం 18 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. ఒడిశాకు చెందిన కూలీలు మాడుగుల వద్ద పనులకు వెళ్లి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను మాడుగుల ప్రభుత్వానికి తరలించారు. వీరిలో ఒకరిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అతివేగమే కారణమని ప్రాథమికంగా అంచనా వేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story